కోల్ కతా నైట్ రైడర్స్ వ్యూహాలు ఏంటో ఓ పట్టాన అర్థమై చావవు. నిన్నటి మ్యాచ్ లో LSG విసిరిన 239 పరుగులు చేయాలి. మెరుపు దెబ్బలు వేసే ప్రోసెస్ లో డికాక్, నరైన్ అవుటైపోయారు సరే. అజింక్యా రహానే, వెంకటేశ్ అయ్యర్ లు అద్భుతంగా పోరాడారు. కెప్టెన్ రహానే 35 బాల్స్ లో 8ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేస్తే...అయ్యర్ ఆరు ఫోర్లు ఓ సిక్సర్ తో 29 బాల్స్ లోనే 45 పరుగులు బాదాడు. అసలు రహానే అవుటై టైమ్ కే 13 ఓవర్లలో 162 పరుగులు చేసేసింది కోల్ కతా ఇంకేం మిగిలింది అసలు. అంతలా కొట్టినప్పుడు. మిగిలిన ఏడు ఓవర్లలో 80 పరుగులు చేయాలి. హిట్టర్లు ఉన్నారు కాబట్టి కాలిక్యులేట్ చేసుకుని ఓవర్ కు 10-12 పరుగులు చేసుకోవాలి అంటే బాల్ కి దాదాపు రెండు పరుగులు రావాలన్నట్లు ఆడాలి. ఇలా ఆడాలి అంటే హిట్టర్లు దిగాలి. కోల్ కతాకు ఉన్నారు కూడా ఆంద్రే రస్సెల్ అనే ఇంటర్నేషనల్ అక్లెయ్మిడ్ హిట్టర్, రింకూ సింగ్ లాంటి దేశవాళీ హిట్టరు ఉన్నారు. వాళ్లు గతంలో ఇలాంటి సిచ్యుయేషన్స్ లో కేకేఆర్ ను ఈజీగా పుల్ ఆఫ్ చేశారు. కానీ కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ ఏం చేసిందో తెలుసా రమణ్ దీప్ సింగ్ ను, చిన్న కుర్రాడు ఆంగ్ క్రిష్ రఘువంశీని పంపించాడు. రమణ్ దీప్ సింగ్ హిట్టరే ఎవ్వరూ కాదనట్లేదు. రఘువంశీ టాలెంటెడ్ ప్లేయరే నో చెప్పట్లేదు. కానీ అక్కడ సిచ్యుయేషన్స్ వేరు. కంప్లీట్ హిట్టింగ్ చేయాలి. బాల్ కి రెండు పరుగులు రావాలి అంటే హిట్టర్లు దాచి పెట్టుకుని రమణ్ దీప్ ను రఘువంశీని పంపింది. రీజన్ ఏంటో తెలుసా రహానే అవ్వగానే క్రీజులో ఉన్న వెంకటేష్ అయ్యర్ లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి రైట్ హ్యాండరైన రమణ్ దీప్ ను..అయ్యర్ అవుట్ కాగానే రమణ్ దీప్ రైట్ హ్యాండర్ కాబట్టి...లెఫ్ట్ హ్యాండరైన రఘువంశీని బ్యాటింగ్ కు పంపింది. అంత టార్గెట్ చేయాలనుకున్నప్పుడు ఈ లెప్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్లు ఎవడు అడిగాడు అండీ కోల్ కతాను మ్యాచ్ గెలవటం కావాలా లేదంటే సంప్రదాయమైన ఆటతీరును ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందాలా వాళ్లిద్దరూ ఫెయిల్ అయ్యారు అనవసరంగా ఆరు బాల్స్ వేస్ట్ అయ్యాయి. తర్వాత దిగిన రస్సెల్ ఆడలేదు. రింకూ సింగ్ 15 బాల్స్ లోనే ఆరు ఫోర్లు 2 సిక్సర్లతో 38 పరుగులు చేసినా అప్పటికే లేట్ అయిపోయింది బాగా...గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులా 234 పరుగుల వరకూ తీసుకువచ్చి LSG కి అప్పగించాల్సి వచ్చింది. నిజంగా ఇది కేకేఆర్ స్ట్రాటజీ ఫెయిల్యూర్.